Articles by nagabhushanam

23న చిత్రపరిశ్రమ మూత?

23న ఫిల్మ్ ఇండస్ట్రీ మూతపడబోతున్నదా…అసలు ఇలా ఎందుకు జరగబోతోందీ…. ? అసలు విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం లేవీసర్వీస్ టాక్స్ విధించాలనుకుంటోంది. ఇదే జరిగితే నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతుందని భయపడిపోతున్నారు నిర్మాతలు. దీంతో ఫిబ్రవరి 23 నుంచి చిత్రనిర్మాణం నిలిపివేస్తామంటోంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అయితే, ఒక్కరోజే చిత్రపరిశ్రమ సమ్మెకు దిగుతుందా, లేక సమస్య పరిష్కారమయ్యేవరకు కొనసాగుతుందా అన్నది ప్రస్తుతానికి మనవద్ద ఇన్ ఫుట్స్ లేవు. కేంద్రప్రభుత్వం సర్వీస్ టాక్స్ పేరిట సుమారుగా 10.3 శాతంవరకు […]


వీరి నవ్వులే మనకు కావాలి

ఈవేళ (జనవరి 24) జాతీయ ఆడశిశువుల రోజు. అంటే గళ్ చైల్డ్ డేగా జరుపుకుంటున్నాం. మహాలక్ష్మి మా ఇంటపుట్టింది అని గర్వంగా చెప్పుకునే రోజులు అంతరించిపోతున్నాయి. మహాలక్ష్మీ మా ఇంటికి రాకురాకు అనే రోజులు వచ్చేశాయి. మరి ఈ పరిస్థితి ఎలా మారుతుంది. దేశంలోని ఇరవైరెండు 22 రాష్ట్రాల్లో , నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆడశిశువుల సంఖ్య ఆందోళనకరమైన స్థాయికి పడిపోయింది. హర్యానాలో అతితక్కువగా ఆడపిల్లులు పుడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అక్కడ ప్రతి వెయ్యిమంది మగశిశువులకు 830 […]


మీడియాలో అవినీతి మాటేమిటి?

రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు. ఒకె, కాదనలేం. అధికార యంత్రాంగం అవినీతి పుట్ట. ఒకె…ఇదీ కాదనలేం. సమాజంలో లేదా ప్రభుత్వంలో ఫలానా వాళ్లు అవినీతి పరులంటా మీడియాలో ఊదరగొడ్తుంటారు. అయితే, ఇదే మీడియా ఓసారి తన ఒంటిమీద ఎంతటి అవినీతి మురికిని అంటించుకుందో పట్టించుకుంటున్నదా? రాజకీయ నాయకులపై అవినీతిపరులన్న ముద్రవేసేటప్పుడు ఒక విషయం ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వారు కూడా మన సమాజ వాస్తవ స్థితిగతులను అద్దం పడుతున్నారు. అంటే అవినీతి […]


ఆర్మీ – ప్రభుత్వం ఎవరిపట్టు ఎంత?

ఈ మధ్య ఒక ఎస్ఎంఎస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. అదేమిటంటే… పాకిస్తాన్ లో సైనికదళ ప్రధానాధికారి ప్రభుత్వం ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తాడు, అదే ఇండియాలో ప్రభుత్వమే ఆర్మీ చీఫ్ పదవికాల వయసును నిర్ణయించేస్తుంటుంది. భారత్ , పాకిస్తాన్ కు ఇంచుమించు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగంలోనూ, సైనిక దళాధికారుల కదలికల్లోనూ చాలా తేడానే ఉంది. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న ఎస్ఎంఎస్ అందుకే అలా చురకవేసింది. సైనికదళ ప్రధానాధికారి విజయ్ కుమార్ సింగ్ పదవీ విరమణ వయసు […]


బడ్జెట్ పై ముందుగానే ఆసక్తి ?

మరోసారి బడ్జెట్ రాబోతుంది. ప్రస్తుతానికి బడ్జెట్ పూర్వసంప్రదింపులే జరుగుతున్నప్పటికీ, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటి నుంచే సామాన్యుల్లో సైతం ఆసక్తి ఏర్పడుతోంది. నిజానికి  ఉగాది నాడు పంచాంగ శ్రవణంలా మారిపోయింది పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం.అయినప్పటికీ ఎప్పటికప్పుడు రాబోయే బడ్జెట్ పై ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు. ప్రస్తుతానికి మనదేశం గడ్డు సవాళ్లనే ఎదుర్కుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతృప్తికరమైన బడ్జెట్ ను అందించడం ఆర్థికమంత్రికి కష్టమే. ప్రస్తుత పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాబోయే […]


పిల్లలపాలిటి శత్రువు హైదరాబాద్ ?

మనరాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరా… ఏమో…కొన్ని లెక్కలు చూస్తుంటే ఇది అభాగ్యనగరమేమో అనిపిస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… రెండువేల ఎనిమిది నుంచి హైదరాబాద్ లోనే ఆరువేల మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఇలా అదృశ్యమైనవారిలో కేవలం రెండువేలనూటతొమ్మిది మంది మాత్రమే తిరిగి ఇళ్లకు చేరారు. ఇలా మిస్సవుతున్న వారిలో ఎక్కువ మంది 12 నుంచి పదిహేను ఏళ్ల మధ్య ఉన్న బాలికలే కావడం ఆందోళన కలిగించే విషయం. రెండువేల ఎనిమిది , పదకొండు మధ్యలో తొమ్మిది […]


కిషన్ యాత్రతో బీజేపీకి మంచి రోజులు ?

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఎందుకు చప్పబడిపోయింది. ఏకారణాలవల్ల తెలంగాణ సాధన పోరు చల్లారిపోయింది ? ఈ ప్రశ్నే తరచూ వినబడుతోంది. సరిగా ఈ పరిణామాన్నే తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది భారతీయ జనతాపార్టీ. అందుకే బీజేపీ తెలంగాణ పోరుయాత్ర మొదలుపెట్టింది. తెలంగాణ సాధన భారతీయ జనాతాపార్టీకే సాధ్యమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. ఇంతకీ బీజేపీ పోరు యాత్ర ఎలా సాగుతుందో తెలుసుకుందాం… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ […]


స్పీకర్ ఏంచేయబోతున్నారు?

శాసన సభలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే తరచూ దాని గురించి వార్తలు వస్తుంటాయి. అయితే, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మొన్నటి శీతాకాల సమావేశాలు ముగిసినా అసెంబ్లీ చుట్టూనే వార్తలు తిరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కీలకమైన రాజకీయ పరిణామాలకు అసెంబ్లీ కేంద్ర బిందువు అవుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ప్రస్తావిస్తాను. మన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని కీలక అంశాలన్నింటినీ ఏకకాలంలో ఉపయోగించుకుంటున్నది ఎక్కడో తెలుసా.. మన రాష్ట్రంలోనే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కిందనే పార్టీ […]


కొత్తా మంత్రులండీ…

కష్టకాలంలో ఆదుకున్నవారిని గుర్తించుకోవడం, ప్రతిగా వారి ప్రయోజనాలను చూడటం ఆనవాయితీ. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం, శాసనసభలో తెలుగుదేశం పార్టీ అవిశ్వాసతీర్మానం పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సొంతగూటిలోనే వ్యతిరేకత. జగన్ వర్గీయులు ప్రభుత్వం పట్ల తమకు విశ్వాసం లేదని బల్లగుద్ది చెప్పేశారు. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం గట్టెక్కడంలో ప్రజారాజ్యం పార్టీ అండగా నిల్చింది. ఈ సందర్బంగానే కాంగ్రెస్ పెద్దలు, చిరంజీవికి కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని […]